Saturday, May 4, 2024

Hyderabad: బీర్ బాటిల్‌తో వ్యక్తిపై దాడి.. గొంతులో పొడవడంతో తీవ్రగాయలు

కుత్బుల్లాపూర్ క్రైమ్, (ప్రభ న్యూస్): హైద‌రాబాద్ కుత్బ‌ల్లాపూర్‌లో దారుణం జ‌రిగింది. ఓ వ్య‌క్తిపై బీర్ బాటిల్‌తో అటాక్ చేసిన ఘ‌ట‌న నెల‌కొంది. గొంతుపై బీర్ బాటిల్‌తో పొడ‌వడంతో తీవ్ర గాయాల‌య్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. మద్యం మత్తులో బీర్ బాటిల్ తో దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయాల‌య్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరొకరు గాయపడిన ఘటన హైద‌రాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవ్వాల జ‌రిగింది.

జీడిమెట్ల పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం… చింతల్ వేంకటేశ్వర నగర్ కు చెందిన విద్యాసాగర్ (27), సందీప్(27) స్నేహితులు. వీరు నిన్న (సోమ‌వారం) అర్ధరాత్రి చింతల్ లో పాషా పాన్ షాప్ వద్ద ఉన్నారు. అదే సమయంలో గౌతం (28), షాబాజ్ (30) అనే ఇద్ద‌రు పాన్ షాప్ సమీపంలో మద్యం తాగుతూ ఉన్నారు. ఈ క్రమంలో విద్యాసాగర్, షాబాజ్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గొడవ పెద్దది కావడంతో షాబాజ్ తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ పగులకొట్టి దానితో విద్యాసాగర్ గొంతుపై పొడిచాడు. ప‌క్కనే ఉన్న సందీప్, గౌతం షాబాజ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సందీప్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితుల‌ను చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement