Sunday, April 28, 2024

Maktal – కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి నేత జలంధర్ రెడ్డి

మక్తల్, ఏప్రిల్13(ప్రభన్యూస్) మక్తల్ నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం రోజు రాత్రి బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన ఇవాళ కొద్ది సేపటి క్రితం మాజీ ఎంపీ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆయ‌న‌కు కాంగ్రెస్ కండువా కప్పి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు .పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాదిరెడ్డి జలంధర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు .ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement