Monday, April 29, 2024

LB Nagar – కారు – లారీ ఢీ … ఇద్దరు మృతి

నాగోల్ ఏప్రిల్ 13(ఫ్రభ న్యూస్) ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరధిలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై దయాకర్ రెడ్డి కథనం ప్రకారం.. హయత్ నగర్ నుంచి మాదాపూర్లోని ఓ ఆసుపత్రిలో హెల్త్ చెకప్ నిమిత్తం వీరయ్య,మొగ్గయ్య జగదీష్ కారులో వెళ్తుండగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో మొగ్గయ్య అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన ముగ్గురిని స్థానికులు కామినేని హస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న వీరయ్య కూడ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు .గాయపడిన జగదీష్, క్యాబ్ డ్రైవర్ చికిత్స పొందుతున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని రోడ్డు మధ్యలో నిలపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రమాదమికంగా నిర్ధారించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement