Friday, May 3, 2024

కాల్వ ద్వార నీటి విడుదల..

దేవరకద్ర : ఉమ్మడి జిల్లాలోని మధ్యతరహా భారీ ప్రాజెక్టు అయిన కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వార నీటి విడుదల కొనసాగుతున్నదని ప్రాజెక్టు ఈఈ చక్రధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు పండిస్తున్న వరికోత ఉన్నందువల్ల రైతుల కోరిక మేరకే మళ్లిd నీటిని విడుదల చేయడం జరిగిందని ఆయన చెప్పారు. విడుదల చేసిన నీటిని రైతులు స ద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సాగర్‌లో నీటి నిల్వ తక్కువగా ఉన్నదని ఆయన చెప్పారు. ఇంకా రెండు మూడు రోజుల వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement