Sunday, April 28, 2024

రేపు మహబూబ్ నగర్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

మహబూబ్ నగర్: జిల్లాకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి రేపు రానున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మాచారి ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ఆయన మధ్యాహ్నం ఒకటి గంటలకు బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వెల్లే ట్రైన్ ను ప్రారంభించనున్నారన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడకుల బాలరాజుతో కలిసి జిల్లా నాయకులు శుక్రవారం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి.సత్యం, జిల్లా కోశాధికారి పాండురంగారెడ్డి, జిల్లా కార్యాలయ ఇంచార్జ్ సుబ్రహ్మణ్యం, పాలమూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు అంజయ్య, పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్, హరినాథ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement