Sunday, April 28, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మరణం

నారాయణపేట జిల్లాలోని ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందాడు. జిల్లాలోని మరికల్‌ మండలంలోని తిలేర్ స్టేజి దగ్గర అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇద్దరు ప్రమాద స్థలంలో మరణించగా, మరొకరు దవాఖానలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement