Sunday, April 28, 2024

TS: ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో చోరీ.. 12 తులాల బంగారం చోరీ

మక్తల్, మార్చి24(ప్రభన్యూస్) : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని న్యూ రాఘవేంద్ర కాలనీలో విద్యుత్ శాఖలో పని చేస్తున్న మన్యంకొండ అనే ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి 12 తులాల బంగారం అపహరించిన ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

ఎండాకాలం కావడంతో ఇంటి తలుపులు తెరిచి తలుపు అడ్డంగా కూలర్ పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే నిద్రపోగా గుర్తుతెలియని దుండగులు చొరబడి ఫ్రిజ్ పైన ఉన్న బీరువా తలం తీసుకొని బీరువాను తెరిచి 12 తులాల బంగారం అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఉదయం నిద్రలేచిన తర్వాత చోరీ జరిగిన విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ వై.భాగ్యలక్ష్మి రెడ్డి చోరీ జరిగిన ఇంటిని సందర్శించి పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement