Friday, April 26, 2024

National : రెండో వివాహం చేసుకుంటే రూ 2 లక్షలు… ఝార్ఖండ్ ప్రభుత్వం

భర్త చనిపోయిన చాలామంది ఆడవాళ్లు రెండో పెండ్లికి అస్సలు ఇష్టపడరు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంటారు. ఈ క్రమంలో తమ సుఖసంతోషాల గురించి ఎంత మాత్రం పట్టించుకోరు. పైగా సమాజం కూడా కొన్ని కట్టుబాట్ల పేరుతో రెండో పెండ్లిని చిన్నచూపు చూస్తుంది.

అలాంటి మహిళలకు భరోసా కల్పించాలనుకుంటున్న ఝార్ఖండ్ ప్రభుత్వం ‘విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో వితంతువులు రెండో పెండ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. పెండ్లి చేసుకుని ఆ సర్టిఫికెట్నీ, చనిపోయిన భర్త మరణధ్రువీకరణ పత్రాన్నీ సమర్పిస్తే- వారి ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేస్తోంది. అయితే ఈ పత్రాలను పెండ్లైన ఏడాదిలోపే సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకీ, పెన్షన్లు తీసుకునేవారికీ ఈ పథకం వర్తించదు. ఏ అండా లేనివారిని ఆదుకోవాలనే ఈ నిర్ణయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement