Saturday, May 11, 2024

సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంఖుస్థాపన

మహబూబ్ నగర్ లోని మినీ ట్యాంక్ బండ్ దగ్గర రూ.12కోట్ల వ్యయంతో నిర్మించనున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఉన్న పర్యాటక శాఖ బలోపేతం చేయడంలో భాగంగా ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పర్యాటక శాఖను బలోపేతం చేసేందుకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నార‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను చూడడానికి వచ్చి ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంత ముందు ఉన్న ప్రభుత్వాలు పర్యాటక ప్రదేశాలను పట్టించుకొనే దాఖలాలే లేవన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత పర్యాటక శాఖకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి జరిగే విధంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, ఎండి మనోహర్, DPRO వెంకటేశ్వర్లు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement