కామారెడ్డి, ప్రభాన్యూస్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. మనస్పర్ధలు తో ఒక వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా బండరాయితో కొట్టి చంపారు.పట్టణంలోని గోపాలస్వామి రోడ్లో నివాసముండే 45 సంవత్సరాల వయస్సు గల రవి అనే వ్యక్తి తలపై కర్రతో కొట్టి రాయితో మోడీ అతి దారుణంగా హత్య చేశాడు గుర్తుతెలియని దుండగుడు. హత్య చేసే సమయంలో సి.సి.కెమేరా లో రికార్డు అయింది. సమాచారం అందుకున్న కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ కు చెందిన రవి కుమార్ అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా కామారెడ్డి పట్టణంలోని గోపాలస్వామి రోడ్ లో నివాసం ఉంటున్నాడు. రవి ఎలాంటి పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. రోడ్లపై అక్కడ అక్కడ పడుకునేవాడు. మంగళవారం తెల్లవారుజామున రవి రామ్ మందిర్ ఏరియా లొని శివాలయం ప్రక్కన గల అరుగు పై పడుకున్నాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తి ముందుగా కర్రతో రవి తల పై కర్ర తో దాడి చేసి అనంతరం పక్కనే ఉన్నా బండరాయి తో మోదీ హత్య చేశాడు. మృతునికి భార్య గీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..