Monday, April 29, 2024

MBNR: గుండాల అంబా రామలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు

మార్చి 8 ప్రభ న్యూస్ వెల్దండ : వెల్దండ మండల పరిధిలో గుండాల అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రామలింగేశ్వర స్వామికి అభిషేకం చేశారు. ఈ దేవాలయం ప్రాముఖ్యత దేవాలయానికి మరో పేరు దక్షిణ కాశి. ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత కోరుకున్న కోరిక తీరుతాయని భక్తుల నమ్మకం శివరాత్రి రోజున గుండాల అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు.

భక్తుల దాహర్తి తీర్చేందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ తన ట్రస్టు ద్వారా పదివేల త్రాగునీటి బాటిళ్లు భక్తులకు పంపిణీ చేశారు. అలాగే శివరాత్రి రోజున భక్తుల ఉపవాసం ఉంటారు కనుక వారికి పండ్లు కూడా పంపిణీ చేశారు. పాపిశెట్టి రాము పూరి రమేష్ ద్వారా భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలను చేస్తున్న ఉప్పల వెంకటేష్ ను ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ ట్రస్టు సభ్యులు పూరి రమేష్, దారముని గణేష్, బుచ్చిబాబు, రాఘవేందర్, పూరి సరిత, పూరి సాయి వరుణ్ అమూల్య, సంతోష్, అనిల్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement