Tuesday, April 30, 2024

రోడ్డు విస్తరణ పనులు..

మహబూబ్‌నగర్‌ : రహదారి విస్తరణలో భాగంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలో రహదారికి ఇరువైపులా వేస్తున్న వృథానీటి పైప్‌ లైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఆదేశించారు. పట్టణంలోని న్యూటౌన్‌ చౌరస్తా వద్ద వృథా నీటి పైప్‌లైన్‌ పనులను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. పైప్‌లైన్‌ వేసేందుకు జాప్యం పై కారణాలను ఆయన ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మున్సిపల్‌ ఇంజనీర్లను ఆదేశించారు. అదే విధంగా రహదారి విస్తరణలో తొలగించిన ఇం డ్లు , షాపులకి సంబంధించి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేసి రహదారి మొత్తం శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. తొలగించిన శిథిలాలు రోడ్డుపైన లేదా ఇండ్ల పక్కన ఉన్నట్లయితే రోడ్‌ పై ప్రయాణించే వారికి ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌ , మున్సిపల్‌ ఇంజనీర్‌ బెంజమిన్‌ , ఇతర అధికారులు , తదితరులు ఉన్నార

Advertisement

తాజా వార్తలు

Advertisement