Tuesday, April 30, 2024

సీబీఎన్ కాదు ‘స్టే’బీఎన్

అమరావతి అసైన్డు భూముల విషయంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తును హైకోర్టు నాలుగు వారాలపాటు నిలిపివేసిన విష‌యం తెలిసిందే. దీంతో చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘సీబీఎన్‌ పేరును ఎప్పుడో స్టేబీఎన్‌గా మార్చారు నెటిజన్లు. ఏ తప్పూ చేయకపోతే కేసులు ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. ఇలా ఎంతకాలం స్టేలతో కాలం వెళ్లదీస్తాడో. ప్రజలు మాత్రం ఈయన చేసిన అక్రమాలకు స్టేలు ఇవ్వకుండా చిత్తుగా ఓడించి తీర్పు చెప్పారు. శిక్ష అమలు చేశారు’ అని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement