Friday, May 17, 2024

Road Accident – అమెరికాలో కారు బోల్తా – మహబూబ్‌ నగర్ వాసి మృతి

అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు విద్యార్థి దుర్మ‌ర‌ణం చెందాడు. వివ‌రాల‌లోకి వెళితే, మహబూబ్‌ నగర్ ( జిల్లా భూత్పూర్‌ మండలం కపెట్ట గ్రామానికి చెందిన బోయ మహేశ్ పై చదువుల కోసం గత డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్శిటీలో ఎమ్‌ఎస్ చేస్తున్నాడు. తన ముగ్గురు స్నేహితులు శివ, శ్రీలక్ష్మి, భరత్‌తో కలిసి మంగళవారం రాత్రి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టి బోల్తాప‌డింది. ఈ ప్రమాదంలో మహేశ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. మహేశ్‌ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందించారు. దీంతో కప్పట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement