Wednesday, May 8, 2024

Maktal – 136 మందికి క‌ల్యాణ ల‌క్షి చెక్కుల అంద‌జేత‌

మక్తల్, (ప్రభన్యూస్) : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. పేదరికం వల్ల ఆడపిల్లల పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అదనంగా ఇవ్వనున్నట్లు మంగ‌ళ‌వారం వెల్లడించారు. మక్తల్ పట్టణంలోని ప్రజా భవన్ లో 136 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 15 మందికి షాది ముబారక్ ద్వారా మొత్తం 151 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement