Sunday, May 5, 2024

MBNR: జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శనీయం.. ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట, రూరల్ 11(ప్రభ న్యూస్): మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం పట్టణంలో అంబేద్కర్ కూడలి వద్ద జ్యోతిరావు పూలే 197వ‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రం పఠానికి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు పూలే ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిభా పూలే పేరు పెట్టి ప్రజా భవన్‌గా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నేత మోపతయ్య గోపాల్ రెడ్డి, రాజేందర్, కౌన్సిలర్ శ్రీనివాసులు, గౌరీ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement