Tuesday, April 30, 2024

కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలి…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మే1)ప్రభ న్యూస్ : నాలుగు సంవత్సరాల తర్వాత జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమ‌లు పరచాలని నాగర్ క‌ర్నూల్ డివిజన్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యున్నత చదువులు చదివి కూడా మన ప్రాంతానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గ్రామాభివృద్ధి కోసం అనునిత్యం పాటు పడే త‌మ‌ను రెగ్యులర్ చేసి ఆదుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement