Thursday, May 2, 2024

TS | భారీగా నగదు పట్టివేత.. 35.49 లక్షలు సీజ్ చేసిన పోలీసులు

చిన్న చింతకుంట, (ప్రభ న్యూస్): మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా చిన్నచింతకుంట మండల పరిధిలోని అంతరాష్ట్ర రహదారి లాల్ కోట చౌరస్తాలో భారీగా నగదును పోలీసులు సీజ్ చేశారు. స్థానిక ఎస్సై ఆర్ శేఖర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఎన్నికల నిబంధనల మేరకు ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద సోమవారం సాయంత్రం 7:00 సమయంలో సరైన పత్రాలు లేకుండా డీసీఎం వాహనంలో తరలిస్తున్న 35 లక్షల 49 వేల 900 రూపాయలను పట్టుకున్నట్లు తెలిపారు. సంతోష్, ఏం ఆంజనేయులుకు సంబంధించిన చేరో ఆరు లక్షలు, శ్రీశైలం 5.20 లక్షలు బి శేఖర్ కు సంబంధించిన 5,7100.. పడవల లింగస్వామి కి సంబంధించిన 6, 63 600.. ఎం. నరసింహకు చెందిన‌వి 5,95,200 గల నగదును పట్టుకొని సీజ్ చేసినట్లు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement