Thursday, May 16, 2024

Delhi | హర్దీప్ సింగు పురితో విజయసాయి రెడ్డి భేటీ.. కేంద్ర గృహ నిర్మాణ పథకాలపై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు, ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తీరుపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సమావేశమై చర్చించారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ప్రకారం మంజూరు చేసిన గృహాలు, వాటి నిర్మాణం పూర్తిచేసి అందజేస్తున్న తీరుపై వివరించినట్టు తెలిసింది. అలాగే బీఎల్సీ (బెనిఫిషియరీ లెడ్- కన్స్ట్రక్షన్),  ఏ హెచ్ పీ (అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్ షిప్) మదలైన పథకాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. మంత్రితో భేటీకి ముందు విజయసాయి రెడ్డి ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో విజయసాయి రెడ్డి పోస్ట్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement