Tuesday, April 30, 2024

భక్తి శ్రద్దలతో హోమాలు..

దేవరకద్ర : మండల కేంద్రంలో స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్దలతో హోమాలు నిర్వహించారు. ఆలయంలో సహస్రనామము , పారాయణ హోమాలు నిర్వహించి నేటితో 21 రోజులు అయినందుకు పూర్ణిమాల నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి అర్చకులు హరీష్‌ శంకర్‌ శర్మ , అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలతో , పూలతో అలంకరించారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో హోమ కార్యక్రమాలు నిర్వహిచారు. నరేష్‌ , పద్మ దంపతులు అలాగే సాయిబాబా , మంజుల దంపతులు భక్తి శ్రద్దలతో హోమం కార్యక్రమాలు చేశారు. అలాగే ఆలయంలో అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య , నాగులు , హరికాంత్‌ , కిషోర్‌ , రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement