Sunday, April 28, 2024

TS : రైతులకు తక్షణమే నష్ట పరిహారం అందించాలి…మాజీ ఎమ్మెల్యే చిట్టెం

మక్తల్, ఏప్రిల్7(ప్రభన్యూస్) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం తక్షణమే అందజేసి ఆదుకోవాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని తహశీల్దార్‌ను కలసి రైతు సమస్యలపై బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతులకు వెంటనే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి .నరసింహ గౌడ్,మాగనూర్ పిఎసిఎస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు అమరేందర్ రెడ్డి ,చిన్న హనుమంతు, మహేశ్వర్ రెడ్డి ,లక్ష్మారెడ్డి, ప్రతాపరెడ్డి, జగ్గలి రాములు, మొగులప్ప, అన్వర్ హుస్సేన్, ఈశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement