Tuesday, May 14, 2024

TS | 1,11,11,111 రూపాయలతో ధనలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

గద్వాల ప్రతినిధి, (ప్రభ న్యూస్) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం, రాజవీధిలో వెలసిన వాసవి కన్యకామరీశ్వరి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఇవ్వాల (శుక్ర‌వారం) 6వ రోజు అమ్మవారు ధనలక్ష్మి దేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు. ఈ అలంకరణలో 1,11,11,111 రూపాయలతో అమ్మవారిని అలంకరించారు. గత ఏడాది ఐదు కోట్లతో ధనలక్ష్మి దేవి అలంకారం చేయడం జరిగినదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా తక్కువ మొత్తంలో అలంకర‌ణ చేసిన‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement