Sunday, May 5, 2024

మణిపూర్ ఘటనపై శాంతి ర్యాలీ.. సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల (ప్రతినిధి), జులై 24 (ప్రభ న్యూస్) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో క్రైస్తవులు అందరూ కలిసి శాంతి ర్యాలీ నిర్వహించారు. మణిపూర్ లో క్రైస్తవులపై, చర్చిలపై హింసాత్మకమైన దాడులకు నిరసనగా క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలో పట్టణ ఐక్య క్రైస్తవ సంఘాల ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు‌‌.

ఈ నిరసన కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంఘీభావం తెలియజేశారు‌. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, గద్వాల మండలం పార్టీ యూత్ అధ్యక్షుడు వేణు, క్రైస్తవ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement