Sunday, April 28, 2024

TS | బీజేపీ, కాంగ్రెస్ ఒకే తాను ముక్క‌లు : గువ్వ‌ల బాల‌రాజు

వంగూర్, (ప్రభన్యూ స్): బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు ఒకే తాను ముక్కలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి శివారులోని ఒ ఫంక్షన్ హాల్లో​ జరిగిన విలేకరుల సమావేశంలో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ, పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​తో కలిసి మాట్లాడారు.

కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ చీఫ్​ రేవంత్ రెడ్డి ఎన్నికల్లోప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని గువ్వల బాలరాజు విమర్శించారు. నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తొక్కిపెడుతూ ఇతర పార్టీల వారికి ప్రాధాన్యం ఇస్తూ.. వారిని పార్టీలో చేర్చుకుంటూ నక్కజిత్తులు ప్రయోగిస్తున్నారని విమర్శించారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు కరెంటు, నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నా వాటిపై దృష్టి సారించడం లేదని గువ్వల మండిపడ్డారు. అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విధానం ఉందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని బాలరాజు ప్రజలను కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement