Sunday, April 28, 2024

MBNR : రాజ్యాంగం వల్లే దేశ ప్రజాస్వామ్యం మనుగడ.. ఎమ్మెల్యే బండ్ల

గద్వాల ప్రతినిధి, ఏప్రిల్ 14 (ప్రభ న్యూస్): భారత రాజ్యాంగం వల్లే దేశ ప్రజాస్వామ్యం మనుగడ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందుచూపుతోనే నేడు అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.

- Advertisement -

ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మాణం చేసి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బ్రతికే విధంగా స్వతంత్ర భారతదేశంలో హక్కును కల్పించడం జరిగిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు అని, అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement