Sunday, April 28, 2024

TS : వంద పడకల ఆసుప‌త్రిని అందుబాటులోకి తెస్తాం…మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఏప్రిల్ 14(ప్రభ న్యూస్) : కొల్లాపూర్‌లోని 100 పడకల హాస్పిటల్ ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామ‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ సమీపంలో ఉన్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణాన్ని ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు.

- Advertisement -

హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చేస్తానని తెలిపారు. అదే విధంగా మాత శిశు సంక్షేమ హాస్పిటల్‌ను మంత్రి సందర్శించారు. అక్కడ పేషంట్‌లకు అందుతున్న‌ వైద్య సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుప‌త్రికి వ‌చ్చే రోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల‌ని వైద్యులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement