Sunday, April 28, 2024

Tribute – బాబాసాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకువెళదాం – ప‌వ‌న్ క‌ళ్యాణ్

బాబా సాహెబ్​ ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని జనసేన పార్టీ అధినేత పవన్​ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్​ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్​ అన్నారు. ఈమేరకు ట్విట్టర్​ (ఎక్స్​) వేదికగా తన సందేశాన్ని షేర్​ చేశారు. ఎల్లవేళలా సమాజం కోసం ఆలోచన చేసిన అంబేద్కర్​ జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్టు పేర్కొన్నారు. అంబేద్కర్​ కొందరివాడు కాదు, అందరివాడు అని.. రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులు, బాధ్యతలు ఇచ్చిన దూరదృష్టి కలిగిన విజ్ఞాని అన్నారు. అసమానతలు, దురహంకారంపై అలుపెరగని పోరాటం చేయడమే కాకుండా సమసమాజ స్థాపన కోసం ఎలా జీవించాలో తన రచనల ద్వారా చైతన్యపరచారన్నారు. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడమే నిజమైన నివాళి అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్స్ వేదిక‌గా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement