Tuesday, May 7, 2024

తెలంగాణ రన్ ను జెండా ఊపి ప్రారంభించినజిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

జోగులాంబ గద్వాల (ప్రతినిధి) జూన్ 12 (ప్రభ న్యూస్) – తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు రాజీవ్ చౌరస్తా నుండి కృష్ణవేణి చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన తెలంగాణ రన్ జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో 21 రోజులపాటు వివిధ రకాల పండుగలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.

ఈ నెల 22 వరకు జరిగే ఉత్సవాలు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహన్, ఆర్డీవో రాములు,ఈ డి రమేష్ బాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement