Wednesday, May 1, 2024

2K Run – ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే హక్కులను సాధించుకోగలిగాం.. మంత్రి జ‌గ‌దీష్‌ రెడ్డి

సూర్యాపేట, ప్రభ న్యూస్: తెచ్చిన తెలంగాణ ఫలితాలను కొత్త తరం ఎంజాయ్ చేయాలని, ఫలితాలను అందిపుచ్చుకుని యువతీ యువకులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలనుపురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన టూ 2కే రన్‌ ను జెండా ఊపి ప్రారంభించారు. కొత్త బస్టాండ్ నుండి సద్దుల చెరువు టాంక్ బండ్ వరకు నిర్వహించిన 2కే రన్‌ లో పెద్ద ఎత్తున యువతీ యువకులు,అధికారులు, పాల్గోన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్‌ సర్కారు యువత బాగుకు, వారి సంక్షేమం కోసం తపిస్తు న్నదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా, ప్రైవేట్‌లో ముఖ్యంగా ఐటీ రంగంలో అవకాశాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. 2014కు ముందుతో పోల్చితే గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయని అన్నారు.

యువత వ్యసనాలకు బానిసకాకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం వినూ త్న మార్పులు తీసుకువచ్చిందన్నారు. నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నదన్నారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రణాళికతో ముందుకెళ్తున్నదన్నారు. ముందుగా మన ఉద్యోగాలు మన బిడ్డలకే దక్కాలన్న లక్ష్యం తో సమైక్య రాష్ట్రంలో ఉన్న జోనల్‌ విధానంలో సీఎం కేసీఆర్‌ సమూల మార్పులు తెచ్చారన్నారు.విధానంలో ఉన్న లోపాల వల్ల వివిధ క్యాడర్‌లోని పోస్టులను స్థానికేతరులు తన్నుకుపోయేవారన్న మంత్రి, ఇందులో ఉన్న లోపాలు.. తద్వారా తెలంగాణ యువతకు జరుగుతున్న నష్టం, మారుమూల జిల్లాలు, మండలాల యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కక పోవడం… ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల విషయంలో శాస్త్రీయత లోపించడం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌ పాత జోనల్‌ విధానాన్ని సమూల ప్రక్షాళన చేశారన్నారు. 95 శాతం ఉద్యోగాలు ఈ ప్రాంత బిడ్డలకే దక్కాలన్న ల క్ష్యంతో..j కొత్త జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. అంతే కాకుండా, ఇప్పటికే లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగా, మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం వెల్లువలా నోటిఫికేషన్లను ఇస్తున్నదన్నారు.ప్రజల కష్టాలు,కన్నీళ్ళ నుంచి పుట్టిందే తెలంగాణ ఉద్యమం అన్న మంత్రి ప్రస్తుత యువ తరానికి తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితుల గురించి అవగాహన ఉండకపోవచ్చు అని అన్నారు.

- Advertisement -

తెలంగాణ రాకముందు కరెంటు లేక కిరోసిన్ దీపాల మధ్య చదువులు వెళ్ల తీయవలసిన దీన పరిస్థితులు ఉండేవన్నారు. 2014 కు ముందు మన తల్లిదండ్రులకు తమను కన్న వృద్ధులకు పెట్టాలో… ఎదిగే తమ పిల్లలకు అన్నం పెట్టాలో తెలియని దౌర్భాగ్యపు పరిస్థితిలు ఉండేవన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే హక్కులను సాధించుకోగలిగాం అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెచ్చిన కల్యాణ లక్ష్మి, రైతుబంధు ,రైతు బీమా ,ఆసరా పెన్షన్ల ,వంటి ఎన్నో పథకాలు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం లో, ఇక్కడి ప్రజల జీవితాల్లో అలుముకున్న చీకట్లను పారద్రోలాయి అన్నారు..పల్లె పల్లెనా విద్యుత్ కోతలకు చెక్ పెట్టగలిగాం అన్నారు.బిందెడు నీటి కోసం మైళ్ళకు మైళ్ళు నడిచే పరిస్థితుల నుంచి….ఇంటింటికీ తాగు నీరు అందించగలిగాం అన్నారు.హేళన చేసిన నేతలకు చెంపపెట్టులా స్వరాష్ట్రం సాధించాం అన్నారు. ఒకప్పుడు గ్రామాల్లోకి వెళ్లాలంటే దుమ్ము కొట్టుకుపోయిన రోడ్లు భయపడేలా చేసేవి అన్నారు. రాష్ట్రం సిద్ధించాక గ్రామాల్లో సైతం అంతర్గత రోడ్లు గ్రామం నుంచి మండలాలకు మండలానికి జిల్లా కేంద్రంలో అద్భుతమైన రహదారులుగా తీర్చిదిద్దామన్నారు . అభివృద్ధిలో గ్రామాల సైతం పట్టణాలతో పోటీ పడుతున్నాయి అన్నారు


సంక్షేమం కోసమే సంవత్సరానికి 65 వేల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాకపోతే,మెడికల్ కాలేజీలు రాకపోయేవి అన్నారు. వచ్చిన మెడికల్ కాలేజ్ లతో ఎంతో మంది యువత వైద్య విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇవన్నీ మరి రాష్ట్ర ఏర్పాటు వల్లనే సాధ్యమైందని మంత్రి అన్నారు. యువతీ యువకులు ప్రభుత్వం అందించే తోడ్పాటు ను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.


కార్యక్రమం లో కలెక్టర్ వెంకట్రావ్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ ఛైర్మన్ అన్నపూర్ణ, జడ్పీ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement