Thursday, May 9, 2024

కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ , కో చైర్మన్ లు గా మధు యాష్కీ , పొంగులేటి

ఢిల్లీ – తెలంగాణ. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా మధు యాష్కీని నియమించినట్లు ఏఐసీసీ పేర్కొంది. ప్రచార కమిటీ కో చైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఎంపిక చేసింది. ప్రచార కమిటీ కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్‌ను నియమించింది. అలాగే, 37మందితో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జాతీయ ఆఫీస్‌ బేరర్లు, పార్టీకి సంబంధించిన పలు శాఖలు, డీసీసీ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది..

మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఏఐసీసీ పరిశీలకులను(AICC Observers) నియమించింది. వీరి నియామక ప్రతిపాదనకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు..

17 లోక్ సభ స్థానాలకు పరిశీలకుల జాబితా

.ప్రకాష్ రాథోడ్ – ఆదిలాబాద్ .శ్రీనివాస్ మనే – భువనగిరి. .అల్లం ప్రభు పాటిల్ – చేవెళ్ల…ప్రసాద్ అబ్బయ్య – హైదరాబాద్క్రి. . స్టోఫర్ తిలక్ – కరీంనగర్. Cఅరిఫ్ నసీం ఖాన్ – ఖమ్మంc.పరమేశ్వర నాయక్ – మహబూబ్ బాద్ మోహన్ కుమార మంగళం – మహబూబ్ నగర్ .రిజ్వాన్ హర్షద్. – మల్కాజ్. గిరి.. బసవరాజ్ మాధవరావు పాటిల్. మెదక్. ..సీసీపివి మోహన్ …- నాగర్ కర్నూల్.అజయ్ ధరమ్ సింగ్. ,నల్గొండ.. సిడి మేయప్పన్ – జహీరాబాద్. .బి.ఎం నాగరాజ – నిజామాబాద్ .విజయ్ నామ్దేవ్ – పెద్దపల్లి., రుబి ఆర్ మనోహర్ న్ -సికింద్రాబాద్, .రవీంద్ర ఉత్తంరావు దల్వి – వరంగల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement