Thursday, May 2, 2024

స‌హ‌నం కోల్పోతున్న కేసీఆర్ : ఈట‌ల రాజేందర్

ముఖ్యమంత్రి కేసీఆర్ సహనం కోల్పోయి బీజేపీ నాయకులపై విరుచుకుపడుతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ విమర్శించారు. వెల్దుర్తి మండలంలో ఎమ్మెల్యే బీజేపీ ముదిరాజ్ సంఘాల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా వెల్దుర్తికి చెందిన బీజేపీ నాయకులు ఆయ‌న‌కు ఘన స్వాగతం పలికారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ము‌ఖ్యమంత్రి స్థాయిలో ఉండి బీజేపీ నాయకులను అడ్డుకునేందుకు దాడి చేయాలని ఉసిగొల్పడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సీఎం శాంతిభద్రతలు కాపాడకుండా దాడి చేయమనడం అసహనానికి నిదర్శనమని ఈటల రాజేందర్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement