Sunday, April 28, 2024

రుణం తీర్చుకుంది… కన్నతల్లికి తలకొరివి పెట్టిన కూతురు

బూర్గంపాడు: మండల కేంద్రమైన బూర్గంపాడులోని అంబేద్కర్ కాలనీకి చెందిన కొండ్రు సావిత్రి (86) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మృతి చెందింది. మృతురాలు కుమారులు ఇరువురు చనిపోయారు. మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుమారులు ఎవరూ లేకపోవడంతో చిన్న కూతురు వెంకటరమణ తన తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకువచ్చారు. కన్నతల్లికి వెంకటరమణ తలకొరిమి పెట్టి కన్న తల్లి రుణం తీర్చుకుంది. నవమాసాలు మోసి కని, పెంచిన కన్నతల్లి రుణాన్ని తీర్చుకున్న వెంకటరమణ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement