Sunday, April 28, 2024

జీవో 317ను రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ లేఖ

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఇబ్బంది ప‌డుతున్న జీవో 317ను రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ లేఖ రాసింది. భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) తెలంగాణ కమిటీ లేఖ విడుదల చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలి. స్థానికత, రిజర్వేషన్ల పై ఆధారపడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఖాళీగా వున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఉద్యోగ అవకాశాలను కోల్పుతున్న నిరుద్యోగులు, విభజన ప్రక్రియ ద్వారా బలి అవుతున్న ఉద్యోగులు, యువకులు ఏకమై జీవో నెం. 317ను రద్దు చేసే వరకు పోరాడండి అంటూ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ రాశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement