Thursday, May 2, 2024

లేగ‌దూడ‌పై చిరుత పంజా.. మ‌ళ్లీ క‌ల‌క‌లం

యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో చిరుత పులి మ‌ళ్లీ కలకలం రేపింది. తాడిపర్తి గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలంలో దొడ్డి యాదయ్య అనే రైతు పొలం వద్ద చిరుతపులి లేగదూడను చంపుక‌ తిన్నది. ఈ విషయాన్ని చుట్టుపక్కల రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. భయాందోళనలో గొర్ల కాపర్లు రైతులు , గ్రామస్తులు చిరుతపులిని పట్టుకొని మూగ జీవ ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ మధ్య కాలంలో చిరుత వరుసగా దాడులు చేసి మూగ జీవాల ప్రాణాలు తీసి తింటుండ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర భయాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement