Saturday, May 18, 2024

సిరిసిల్లలో జనశక్తి సమావేశం.. ప్రచారం చేసిన విశ్వనాథ్ అరెస్ట్

సిరిసిల్లలో జనశక్తి సమావేశంపై పోలీసులు సీరియస్ అయ్యారు. సిరిసిల్లలో జనశక్తి సమావేశం నిర్వహించిన విశ్వనాథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చౌటుప్పల్ లో విశ్వనాథ్ ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న విశ్వనాథ్ పేరుతో జనశక్తి లేఖ విడుదలైన సంగతి తెలిసిందే. చౌటుప్పల్ లో ఉన్న అశోక్ ను సైతం పట్టుకున్నారు. కొన్ని రోజులుగా సిరిసిల్లలో జనశక్తి సమావేశాలంటూ ప్రచారం చేస్తున్నారు. జనశక్తి సమావేశాలపై విశ్వనాథ్ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తాము ఎలాంటి సమావేశాలు పెట్టలేదని విశ్వనాథ్ ప్రకటించారు. మరోవైపు విశ్వనాథ్, అశోక్ ను కోర్టులో హాజరుపరచాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement