Monday, May 20, 2024

విజ‌య‌ద‌శ‌మికి థియేట‌ర్ లో రిలీజ్ కానున్న ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’

విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 5వ తేదీన థియేట‌ర్ లో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట చిత్ర యూనిట్. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్నాడు. క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఎ.ఎమ్. రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథ ఇది. అందువలన ఆ కాలం నాటి కట్టడాల సెట్స్ కోసం భారీ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ అలరించనుంది.50 శాతం వరకూ చిత్రీకరణ జరిగిన తరువాత కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. డిసెంబరులోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి ప్రయత్నించినా కుదరలేదు. త్వరలోనే షూటింగును మొదలు పెట్టి సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తిచేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement