Saturday, May 11, 2024

అభివృద్ధిలో సంచ‌ల‌నాలు సృష్టించిన నాయ‌కుడు కేసీఆర్ : జ‌గ‌దీశ్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టును సాకారం చేసిన నాయకుడు, సంక్షేమం, అభివృద్ధిలో సంచలనాలను సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని రాష్ట్ర మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి కొనియాడారు. ఆయ‌న మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై కొందరు అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని, ఆయనను టచ్ చేస్తే భస్మమైపోతారన్నారు. పైరవీలు, దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రమైనా.. అభివృద్ధిలో మాత్రం పరుగు పెడుతోందన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఉండేదా ? అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి మంచినీరు అందేదా ? అని అడిగారు. దళారులకు దోచి పెట్టడం, వారితో అంటకాగడం తప్ప బీజేపీ నేతలు చేసిందేముందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో పేదరికం మరింత పెరిగిందని చెప్పారు. మోదీ పాలనలో దళారులు కుబేరులయ్యారని, దేశం మాత్రం దివాలా తీసిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement