Tuesday, May 14, 2024

RIP – ఉద్యమ నేతకు మంత్రి కెటిఆర్ కడసారి వీడ్కోలు .. అండ‌గా ఉంటామ‌న్న ఎంపీ జోగినిపల్లి

ములుగు, జూన్ 12: తెలంగాణ ఉద్యమ నేత, ములుగు జెడ్పీచైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ అంత్యక్రియలకు మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు త‌దిత‌రులు హాజ‌రయ్యారు.. భారత రాష్ట్ర సమితి జెండా ను కుసుమ జగదీష్ పార్థీవ దేహాం పై కప్పి ఘన నివాళి అర్పించారు మంత్రి కెటిఆర్ .. తీవ్ర విషాదంలో ఉన్నకుసుమ కుటుంబల‌ను మంత్రి ఓదార్చారు.. కుసుమ మృతి ప‌ట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మాట్లాడిన‌ మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని భరోసా కల్పించారు. ప్ర‌తి విష‌యంలోనూ వ్య‌క్తిగ‌తంగా,పార్టీ ప‌రంగా అన్ని విధాలు ఆదుకుంటామ‌ని కుసుమ కుటుంబానికి హామీ ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement