Monday, April 29, 2024

Jagan Counter: బీజేపీపై ధ్వజమెత్తిన జగన్.. అండ లేకున్నా గెలుస్తామంటూ ధీమా..

పల్నాడు: గత నాలుగేళ్లుగా బీజేపీతో సఖ్యత కొనసాగించిన జగన్ ఇప్పుడు తిరుగుబావుటా ఎగురవేశారు. నిన్న విశాఖలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాలుగేళ్ల జగన్ పాలనపై విమర్శలు చేశారు. అభివృద్ధి నిరోధకుడంటూ ఘాటుగానే స్పందించిన అమిత్ షా ఏపీ జగన్ పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందినట్లు విరుచుకుపడ్డారు.

ఈ నేపథ్యంలో జగన్ నేడు క్రోసూరులో జరిగిన విద్యా దీవెన కార్యక్రమంలో ఇటు బీజేపీని, అటు అమిత్ షాను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. తొలిసారిగా బీజేపీ పై ఎదురుదాడికి దిగారు. పేదలపై జరుగుతున్న యుద్ధం. మీ జగనన్నకు ఎవరితోడు అవసరం లేదని, దత్తపుత్రుడు అసలే లేడని, మీ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని అన్నారు. ప్రజాబలంతోనే తిరిగి గెలుస్తానని, బీజేపీ అండ తనకు అవసరం లేదంటూ కాసింత గట్టిగానే చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement