Wednesday, May 15, 2024

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు .ఉదయం 11.00గంటలకు దుమాల గ్రామంలో యాదవుల మల్లన్న పట్నాలకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజన్నపేట గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 12.30 గంటలకు దేవునిగుట్ట తండా (గొల్లపల్లి) గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం. మధ్యాహ్నం 1 గంటకు ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి తండా (తిమ్మాపూర్)గ్రామపంచాయతీ భవనం మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రాచర్ల తిమ్మాపూర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. కేటీఆర్ రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ రాకతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement