Tuesday, May 7, 2024

మాజీ మేయర్ బొంతు రామ్మోహ‌న్‌ కి కేటీఆర్ ప్రశంసలు..కొత్త కార్పొరేటర్లకు దిశ నిర్ధేశం..

హైద‌రాబాద్ – జీహెచ్ఎంసీ మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంస‌లు కురిపించారు. ఈ ఐదేళ్ల కాలంలో హైద‌రాబాద్ అభివృద్ధి కోసం అద్భుత‌మైన కృషి చేశార‌ని ఆయ‌న అభినందించారు. మేయ‌ర్‌గా బొంతు రామ్మోహ‌న్ ప‌ద‌వీ కాలం నిన్నటి ముగియ‌డంతో ఆయ‌న ట్వీట్ చేశారు.
కార్పొరేట‌ర్ల‌తో స‌మావేశం..
తెలంగాణ భవన్ కార్పొరేటర్ల తో సమావేశంలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి మనం అందరం కట్టుబడి ఉండాలని మంత్రి కార్పొరేటర్లకు సూచించారు. మొదటి దారి ఉద్యమంలో కీలకంగా బొంతు రామ్మోహన్, బాబా ఫేషియోద్దీన్ లకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా మనం స్వాగతించాలని మంత్రి కేటీఆర్ కార్పొరేటర్లకు తెలిపారు. ఆ త‌ర్వాత అంద‌రూ కార్పొరేష‌న్ కార్యాల‌యానికి బ‌య‌లుదేరి వెళ్లారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement