Sunday, May 12, 2024

KTR – ద‌క్ష‌త క‌లిగిన ద‌మ్మున్న నాయ‌కుడు కేసీఆర్ ఉండ‌టం వ‌ల్లే ఐటిలో పురోగ‌తి…..

హైద‌రాబాద్ : ద‌క్ష‌త క‌లిగిన ద‌మ్మున్న నాయ‌కుడు కేసీఆర్ ఉండ‌టం వ‌ల్లే అభివృద్ధిలో దూసుకుపోతున్నామ‌ని,. దేశంలో ఉన్న‌ ఐటీ పురోగ‌తితో పోలిస్తే మ‌న ఐటీ పురోగ‌తి నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు… శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఐటీ ఎగుమ‌తుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ వివ‌రంగా స‌మాధానం ఇచ్చారు. తెలంగాణ‌లో మ‌తాల పంచాయ‌తీ లేదు, కులాల మ‌ధ్య కొట్లాట లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. స్టేబుల్ గ‌వ‌ర్న‌మెంట్.. ఏబుల్ లీడ‌ర్‌షిప్ వ‌ల్లే ఇదంతా సాధ్యం అయింద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. గురుగ్రామ్‌లో ఐటీ ప‌రిశ్ర‌మ‌ను నాశ‌నం చేస్తున్నారు. మ‌ణిపూర్‌లో తెగ‌ల మ‌ధ్య కొట్లాట పెట్టారు అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

హైద‌రాబాద్‌లోని బేగంపేట‌లో 1987లో మొట్ట‌మొద‌ట ఐటీ ట‌వ‌ర్ వ‌చ్చింద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కు.. 27 సంవ‌త్స‌రాల్లో ఐటీ రంగాల్లో రూ. 56 వేల కోట్లు ఐటీ ఎగుమ‌తులు మాత్ర‌మే న‌ని, కానీ గ‌తేడాది తెలంగాణ ప్ర‌భుత్వం ఐటీ రంగంలో రూ. 57,707 ఐటీ ఎగుమ‌తులు సాధించింద‌ని పేర్కొన్నారు. ఇది స‌మ‌ర్థ‌త గ‌ల ప్ర‌భుత్వంతోనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయ‌ని, . ప్రముఖ ఐటీ కంపెనీలు హైద‌రాబాద్‌కు వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం వ‌చ్చాక 6 ల‌క్ష‌ల‌కు పైగా ఐటీ ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని, . ద్వితీయ శ్రేణి న‌గ‌రాల‌కు ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌ను విస్త‌రిస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే చాలా న‌గ‌రాల్లో ఐటీ కంపెనీలు ప్రారంభ‌మ‌య్యాయని తెలిపారు. దేశంలో మొత్తం సృష్టించిన టెక్నాల‌జీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణ‌వే అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఇవాళ ఎక‌రం ధ‌ర రూ. 100 కోట్లు ప‌లుకుతోంది అని కేటీఆర్ గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement