Sunday, April 28, 2024

కోటి వృక్షార్చ‌న – మొక్క‌లు నాటిన కెటిఆర్, క‌విత‌, సంతోష్ కుమార్..

హైద‌రాబాద్ – ముఖ్య‌మంత్రి కెసిఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంపి సంతోష్ కుమార్ ఇచ్చిన కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మానికి తెలంగాణ అంత‌టా పెద్ద ఎత్తున స్పంద‌న క‌నిపిస్తున్న‌ది.. వివిధ ప్రాంతాల‌లో మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు స్థానిక ప్ర‌జ‌ల స‌హ‌కారంతో మొక్క‌లు నాటుతున్నారు.. దీనిలో భాగంగా ముఖ్య‌మంత్రి కెసిఆర్ అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మంత్రి కెటిఆర్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి పాల్గొన్నారు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లో కెటిఆర్, ఆయ‌న భార్య, కుమార్తె ల‌తో క‌ల‌సి మొక్క‌లు నాటారు..అలాగే గ్రీన్ ఛాలెంజ్ ఆధ్యుడు సంతోష్ కుమార్ జంట న‌గ‌రాల‌లో జ‌రిగిన వివిధ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొని మొక్క‌లు నాటారు.. ఆయ‌న‌తో పాటు రాజ్య‌స‌భ స‌భ్యుడు కెకె, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.. ఇక ఎమ్మెల్సీ క‌విత త‌న నివాసంలో భ‌ర్త అనిల్ తో క‌ల‌సి మొక్క‌లు నాటారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement