Thursday, March 28, 2024

బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌కు రెండున్న‌ర‌ కిలోల‌ బంగారు చీర

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బుధ‌వారం ఉదయం బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌కు బంగారు చీర స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు మంత్రి త‌ల‌సాని. ఎల్ల‌మ్మ అమ్మ‌వారికి పంచామృతాల‌తో ప్ర‌త్యేక అభిషేకం, మృత్యుంజ‌య హోమం, ఆయుష్షు హోమం నిర్వ‌హించారు. ఆల‌య అర్చ‌కులు తెలంగాణ రాష్ర్టం సుభిక్షంగా ఉండాల‌ని ఆశీర్వ‌దించారు. దాత‌ల స‌హ‌కారంతో రెండున్న‌ర కిలోల బంగారంతో ఈ చీర‌ను త‌యారు చేయించ‌డం విశేషం. కాగా, సికింద్రాబాద్ మ‌హంకాళి ఆల‌యంలోనూ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అమీర్‌పేట‌లోని గురుద్వార‌ను సందర్శించిన మంత్రి త‌ల‌సాని.. కేసీఆర్ శ్రేయ‌స్సు కోరుతూ పూజ‌లు నిర్వ‌హించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement