Thursday, May 2, 2024

నేటి నుంచి అమెరికాలో కేటీఆర్‌ పర్యటన

తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికాలో పర్యటించనున్నారు. మంగళవారం (16వ తేదీ) నుంచి సుమారు రెండు వారాల పాటు మంత్రి అమెరికాలో పర్యటించనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా అక్కడి ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను కంపెనీల ప్రతినిధులకు వివరిస్తారు

Advertisement

తాజా వార్తలు

Advertisement