Sunday, April 28, 2024

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత – ముగ్గురు మృతి

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మొగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా తొమ్మిదికి గాయాలు అయ్యాయి. ఇందులో 2 పోలీసులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన న్యూ మెక్సికో పట్టణంలోని పాఠశాలలో జరిగింది. కాల్పులు జరిగిన వ్యాక్తిని సంఘటనా స్థలంలోనే పోలీసులు కాల్చి చంపారు. వాయువ్య న్యూ మెక్సికోలో సోమవారం నాడు భయంకరమైన కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు. ఈ దాడిలో ప్రజలే కాకుండా పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఇంతలో, పోలీసులు వెంటనే మేల్కొని నేరస్థుడిని కాల్చి చంపారు. దాదాపు 50,000 మంది జనాభా ఉన్న ఫార్మింగ్‌టన్‌లో ఉదయం 11 గంటల ప్రాంతంలో సాయుధుడు కాల్పులు జరిపాడు

అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన నిందితుడిని హతమార్చారు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి సహా ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరంతా క్షేమంగా ఉన్నారని న్యూ మెక్సికో పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement