Saturday, May 4, 2024

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు దుర్మరణం

రంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుర్కయాంజల్‌ కూడలి వద్ద జరిగింది. సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. వారి వివరాలు మాత్రం తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement