Wednesday, May 15, 2024

మరోసారి వాయిదా పడిన KRMB RMC భేటీ

శుక్రవారం జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు రిజర్వాయర్ల పర్యవేక్షణ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్‌ 2న జరగాల్సిన సమావేశం..ఈనెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. భేటీ ఆగస్టు చివరి వారంలో జరుగాల్సి ఉండగా.. సెప్టెంబర్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా నదీ జలాల భాగస్వామ్యం, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) పవర్‌హౌస్‌ల నిర్వహణకు పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించడం, రిజర్వాయర్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడడం తదితర కీలక అంశాలపై బోర్టు సమావేశంలో చర్చించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement