Friday, May 3, 2024

భ‌ద్రాద్రిలో విషాదం – కొత్తగూడెం వ‌న్ టౌన్ మ‌హిళా హెడ్ కానిస్టేబుల్ డ్రైనేజీలో ప‌డి దుర్మ‌ర‌ణం

భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు డ్రైనేజ్ లో పడి కొత్తగూడెం వన్ టౌన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ రమాదేవి ప్రాణాలు కోల్పోయింది. కెటిఆర్ ప‌ర్య‌ట‌న‌కు బందోబ‌స్తుకు వ‌చ్చిన ఆమె రామాలయం వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలం వద్ద నుంచి అన్నదాన సత్రం వైపు నడుచుకుంటూ వస్తుండగా డ్రైనేజ్ లో పడిపోయింది. స్థానికుల సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్లోయిస్ గేట్ల వద్ద కానిస్టేబుల్ రమాదేవి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement