Monday, May 6, 2024

Shiridi | షిరిడీ సాయి సేవలో కోలేటి.. సీఎం కేసీఆర్ ను దీవించాల‌ని ప్రార్థ‌న‌

షిర్డి సాయిబాబాను తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ ఇవ్వాల (శుక్ర‌వారం) దర్శించుకున్నారు. మధ్యాహ్నం హారతిలో పాల్గొన్న దామోదర్ తదనంతరం బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు ఆయ‌నకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇచ్చి దేశానికి సేవచేసే శక్తిని కలిగించాల‌ని బాబాను వేడుకున్నట్టు తెలిపారు.

త్వరలో జరగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీ విజయం ఖాయమని కోలేటి చెప్పారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం పీఠాన్ని అధిష్టించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సుబిక్షంగా వుండాలని రాష్ట్రం మరింత అబివృది సంక్షేమ దిశగా అడుగువేయాలని బాబాను కోరుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని బాబాను ప్రార్ధించాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement